నడవడి నేర్పిన రాముడు
హిందూలు పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం, భారతం, భాగవతం. ఇవి అన్నీ మానవ మనుగడకి కావలసిన జీవిత నౌకల వంటివి. వాటిలోని ప్రతీ సన్నివేశం క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేడు మనకి వస్తున్న అనుభవాలలాగే ఉంటారుు. ఇక అందులో ప్రతి పాత్రా మానవజీవిత పరమార్ధానికి అద్దం పట్టేవే. రామాయణ కాలంలో శ్రీరాముడు, హనుమంతుడు, లక్ష్మణుడు, రావణుడు, గుహుడు ఇత్యాది చరిత్రలన్నీ మనం ఏ విధంగా నడచుకుంటే ధర్మాన్ని నిలబెట్టగలమో సూచించే దిక్సూచులే. అదేవిధంగా మహాభారత కాలంలో ధర్మరాజు, శ్రీకృష్ణూడు, అర్జునుడు, దుర్యోధనుడు మెుదలైన వ్యక్తుల వ్యక్తిత్వాలు కూడా మనల్ని జీవితాంతం నడిపించే జీవగరల్రే. అందుేక, ‘రాముడిలా నడచుకోవాలి, కృష్ణూడిలా మసలుకోవాలి’ అని పెద్దలు చెప్తూవుండేవారు. శ్రీరాముడు మనిషి ఏవిధంగా నడచుకోవాలో ఆ విధంగా తాను ఆచరించి చూపించాడు. శ్రీకృష్ణూడు అన్నిటా తానై ఉంటున్నట్టు కనిపించినా తామరాకు మీద నీటి బిందువులా మసలుకున్నాడు.
అమృత వాక్కులు
అమృత వాక్కులు
రాముని జనన విశేషం...
ఇందులోనే శిష్ట రక్షణ కూడా దాగివుంది. ఎలాగంటే, వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు శ్రీహరి పరమ భక్తులు. సప్త ఋషుల వల్ల శాపగ్రస్తులవ్వగా శ్రీహరి తరుణోపాయాన్ని ప్రసాదించాడు. అవి ఏమిటంటే, పరమ భక్తులుగా పుట్టి 7జన్మల తర్వాత తనను కలుసుకోవడం ఒక మార్గం, ఇక రెండవది బద్ధ శత్రువులై శ్రీహరి చేతిలోనే సంహరింపబడి 3 జన్మల్లోనే స్వామి సన్నిధిని చేరుకోవడం. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోమని శ్రీహరి అడగగా, శ్రీహరిని విడిచి 7జన్మలు గడపటం అసాధ్యంగా భావించిన జయవిజయులు, ‘స్వామీ మేము తమకు బద్ధ విరోధులమై 3జన్మల్లోనే తిరిగి మీ వద్దకు వచ్చేటట్టు వరాన్ని ప్రసాదించు’ అని వేడుకున్నారు. శిష్టులైన వీరికి శాప విమోచనాన్ని కలిగించి రక్షించడం తన కర్తవ్యం.
ఆ కాలంలోనే శ్రీరాముడు జాతి, కుల వివక్షలేకుండా స్నేహ ధర్మాన్ని పాటించి విశ్వసౌభ్రాతృత్వం కనబరచిన మాన్యుడు శ్రీరామచంద్రుడు. అందుకు ఉదాహరణ, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న గుహుడ్ని ప్రేమతో అక్కున చేర్చుకుని కులం అంటే మనవత్వం అని చాటిచెప్పిన గొప్ప మానవతావాది శ్రీరాముడు. పక్షి జాతి అయిన జటాయువుని పట్ల కృతజ్ఞతా భావంతో అంత్యక్రియలు కూడా చేసి సద్గతుల్ని ప్రసాదించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. వనచర జాతికి చెందిన వానర సమూహంతో స్నేహ బంధాలు ఏర్పరచుకున్న స్నేహశీలి.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే, రామునిది ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని. ఇది కూడా ఆయన స్వయంగా ప్రకటించుకున్నాడు. చెప్పినదానినే తూ.చా. తప్పకుండా ఆచరించాడు. తండ్రికిచ్చిన మాటని పాటించాడు. అరణ్యవాసం తరువాత నగరానికి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలకిచ్చిన మాట కోసం మళ్ళీ సీతామాతను పరిత్యజించాడు. అందుకే ఒకే మాట మీద నిలబడే రాముడు, సత్యవాక్పరిపాలకుడు అన్న బిరుదు వహించాడు.
సీతామాతనే తప్ప అన్యకాంతల ముఖాలు కూడా చూడలేదు. శూర్పణఖ వృత్తాంతమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించిన మహోన్నతుడు శ్రీరామచంద్రుడు. అందుకే ఆయనకి ఒకే పత్ని. అన్న బాటని అనుసరించారు తమ్ముళ్ళు. తమ్ముల మాటని గౌరవించాడు శ్రీరాముడు. భ్రాతృప్రేమకి ఇదే నిదర్శనం. రామునిలో ఇన్ని కోణాలు దర్శించి రచించిన వాల్మీకి ఆ రామాయణ కావ్యాన్ని మనకందించాడు. రామాయణం అన్ని యుగాలకీ నిత్య పారాయణం.
రాజ్యకాంక్షగానీ, లోభత్వం కానీ,
స్వలాభాపేక్షగానీ రామునిలో కనిపించవు. అదీకాక ఈ సంఘటనల వల్ల శ్రీరాముని దాతృత్వం కూడా వ్యక్తమవుతుంది. అలాగే కైకేయి కోరిక మీద, తండ్రి ఆనతి తలదాల్చి రాజ్యాన్ని భరతునికి ధారపోసి వనవాసానికి వెళ్ళడం వల్ల తల్లిదండ్రుల పట్ల తనయుల కర్తవ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన ధీరుడు శ్రీరామ చంద్రుడు. కట్టుకున్న ఇల్లాల్ని ఎంతగా ప్రేమించాడో, ఆమెని విడిపించడాన్ని బట్టే అర్ధం అవుతుంది.
దేవతలు ఎందరు?
ఇక్కడ కోటి అంటే సమూహం అనే అర్థమే తీసుకోవాలి గానీ, సంఖ్యతో సంబంధం లేదు. ఇంకా పితృదేవతలు అని మరొక వర్గం ఉంది. వీరు మరణించిన వారి సంత తిచే చేయబడే శ్రాద్ధ కర్మలచే తృప్తి పొంది, మృతులకు వారి బంధువులకు కూడ దుర్గతి నివారణ, సద్గతి ప్రాప్తి కలిగించగల అధికా రాన్ని కలిగి ఉంటారు. మనిషి మరణించడం తోటే, మొదట వెళ్ళేది పితృ లోకానికే. అక్క డే అందరి జన్మల వివరాలు, చేసిన పాప పుణ్యాల జాబితాలు ఉంటాయి. ఆ లోకంలో ఉన్న జాబితాకు కనుగుణంగా, జీవి ఆయా లోకాలకు వెళ్తాడు. తిరిగి కర్మలనాచరించి ఈలోకానికి చేరుతుంటాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. అన్నారు శంకర భగవత్పాదులు.
ఒక్కొక్క సారి చాలామందికి ఎన్నో సందేహాలు కలుగుతూవుం టాయి. పురాణాల్లో కూడా అనేక సందేహాలు తలెత్తుతాయి. అయితే వాటన్నిటికీ సందేహ నివృత్తి కూడా ఆయా పురాణాల్లోనే ఉంటుంది. అదే పురాణ గ్రంధాల్లోని విశిష్టత. ఇక్కడ దుర్వాసునికి కోపం ఎందుకు పెట్టవలసి వచ్చిందో కూడా ఆయన వృత్తాంతంలోనే ఉంది.
దూర్వాసునికి కోపం వచ్చింది
అప్పుడు ఆ మహా సాధ్వి ‘మీ ముగ్గురి దివ్యాంశలతో నాకు బిడ్డలు కలగాలి’. అని కోరుకుంది. వారు సరేనన్నారు. ఆ ప్రకారం బ్రహ్మ అంశతో చంద్రుడు, మహా విష్ణువు అంశతో దత్తాత్రేయుడు కలిగారు. ఆగ్రహాన్ని శివుడు అనసూయలో ప్రవేశపెట్టగా, ఆ కోప స్వభావునిగా, ఆనసూయకు దూర్వాసుడు పుట్టాడు. అలా కోపానికి మారు పేరయ్యాడు. దేవతలు సైతం దూర్వాసుడు పేరు చెప్తే వణికిపోతారు.
ఆత్మజ్ఞానం అందించేదే గీతనేటి యాంత్రిక జీవన విధానంలో ప్రతి ఇంటా చేయవలసిన భగవద్గీత పారాయణం చాలా మందికి సాధ్యపడని విషయం. అందుకే కనీసం రోజుకు రెండు గీతా శ్లోకాలు చదివితే జీవిత పరమార్ధం, గీతార్ధం అందరికీ అవగతమౌతాయి.
శ్లోకంః యం హి న వ్యథయం త్యేతే
పురుషం పురుషర్షభ
సమ దుఃఖ సుఖం ధీరం
సోమృతత్వాయ కల్పతే
హే పురుష శ్రేష్ఠా! ప్రకృతి సిద్దమైన అనుకూల, ప్రతికూల అనుభవాలు త్రోసిపుచ్చ రానివే. ఎండ, వానల వల్ల కలిగే శ్రమను సహించుట అలవాటే. అలాగే యుద్ధంలో బంధువధవల్ల కలిగే సుఖమైనా, దుఃఖమైనా తాత్కాలికమే అనే ధైర్యంతో ఎదుర్కొను సమ బుద్ధి కలవానిని మాత్రా స్పర్శలు ఏమీ చేయ లేవు. అట్టి స్వవర్ణోచిత కర్మను బాధలెదురైనా సమబుద్ధితో సహనబుద్ధితో చేయు మానవుడు మాత్రమే అమృతత్వమునందగలడు. అందుకే ఓరిమి అలవరచుకొమ్ము. అమృతత్వాన్ని సాధింపుము.
శ్లోకంః అవినాశి తు తద్విద్ది
యేన సర్వ మిదం తతం
వినాశ మవ్యయ స్వాస్య
న కశ్చిత్ కర్తు మర్హతి
ఆత్మ నాశమునొందక నిత్యముగా ఉండుటకొక కారణమును తెలిపెదను. ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువును నశింపజేయ వలెనంటే, అందులో దూరి, దానిని నిశింపజే యవలెను. ఆత్మలు అతి సూక్ష్మములు. ఏ సూక్ష్మ పదార్థమునందైనా ప్రవేశించగలవు. కానీ ఆత్మయందు ప్రవేశించగల సూక్ష్మ పదార్ధం ఏదీ లేదు. ప్రకృతిలో అన్ని పదార్ధాల్లో ప్రవేశించగల శక్తి ఆత్మకుంది. కాబట్టి ప్రకృతి వల్ల తయారగు శరీరములన్ని నశించేవి. ఆత్మ నశించనిది. కనుకనే ఏ విష శస్త్రాదులూ ఆత్మను ఏమీ చేయలేవు.
No comments:
Post a Comment